నిజంనిప్పులాంటిది

Mar 13 2024, 08:15

పదో తరగతి పరీక్షలను కఠిన ఆంక్షలతో నిర్వహించాలి : సీఎం రేవంత్

పదో తరగతి పరీక్షలను కఠిన ఆంక్షలతో నిర్వహిం చాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.

గత ఏడాది జరిగిన పలు ఘటనల నేపథ్యంలో ఈసారి పక్కాగా పరీక్షలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో పరీక్ష కేంద్రాల వద్ద నో సెల్ ఫోన్ జోన్లను ఏర్పాటు చేయనున్నారు.

పరీక్ష పూర్తయ్యేంత వరకు అవసరమైతే జామర్లు ఏర్పాటు చేసి, ఫోన్ సిగ్నల్స్ ఆఫ్ చేయించే ఆలోచనలో అధికారులు ఉన్నారు. ఇన్విజిలేటర్లు, స్క్వాడ్, సిబ్బంది, విద్యార్థులు ఎవరికీ ఫోన్లు అందుబా టులో లేకుండా చూడను న్నారు.

పరీక్ష కేంద్రం నుంచి ప్రశ్నా పత్రాలు బయటకు వెళ్లకుం డా, మాస్ కాపీయింగ్ జర గకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోనున్నారు.

ఈ నెల 18 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు పదో తర గతి పరీక్షలు జరగను న్నాయి.

నిజంనిప్పులాంటిది

Mar 12 2024, 12:44

హర్యానా సీఎం రాజీనామా?

హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ ఈరోజు రాజీనామా చేశారు.

గవర్నర్ కు తన రాజీనామా లేఖను ఆయన సమర్పిం చారు.ఈరోజు మధ్యాహ్నాం కొత్త సీఎం ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

జేజేపీ, బీజేపీ కూటమిలో విబేధాలు నెలకొన్నాయి. దీంతో బీజేపీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.

కాసేపట్లో బీజేఎల్పీ సమావేశంలో కొత్త సీఎంను ఎన్నుకోనున్నారు...

నిజంనిప్పులాంటిది

Mar 12 2024, 12:43

ఆస్ట్రేలియాలో మహిళ హత్య? ఇండియాకు తెచ్చేందుకు యత్నాలు

ఆస్ట్రేలియలో భర్త చేతిలో దారుణ హత్యకు గురైన శ్వేత (36) మృతదేహాన్ని భారత్ కు తీసుకువచ్చేం దుకు కేంద్ర హోంశాఖ యత్నాలు చేస్తోంది.

ఇటీవల హైదరాబాద్ ఏఎస్ రావు నగర్ కు చెందిన శ్వేతను ఆమె భర్త అశోక్ రాజ్ ఆస్ట్రేలియాలోని విక్టోరియాలో హత్య చేసి చెత్త కుండీలో పడేసిన విషయం తెలిసిందే.

కాగా రాచకొండ పోలీసు లను కేంద్ర హోంశాఖ ఆరా తీసింది. త్వరలోనే డెడ్ బాడీని నేడో, రేపో హైదరా బాద్ కు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు..

నిజంనిప్పులాంటిది

Mar 12 2024, 09:16

తెలంగాణలో హీటెక్కిన పాలిటిక్స్.. ఒకే రోజు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ సభలు

ఒకే రోజు మూడు పార్టీల సభలు..ఔను..తెలంగాణలో లోక్‌సభ దంగల్‌‌కు మూడు ప్రధాన పార్టీలు సిద్ధమ య్యాయి. ఈరోజు పరేడ్ గ్రౌండ్‌లో కాంగ్రెస్, కరీంనగర్‌లో బీఆర్ఎస్, ఎల్బీ స్టేడియంలో బీజేపీ సభలు జరగనున్నాయి. దాదాపు లక్షమంది మహిళలతో కాంగ్రెస్ మీటింగ్ నిర్వహించనుంది.

ఈ సభ వేదికగానే... మహాలక్ష్మీ గ్యారెంటీపై స్పష్టమైన ప్రకటన చేసే అవకాశముంది.. ఇక ఈ రోజు కరీంగనగర్ వేదికగా ఎన్నికల శంఖరావం పూరిం చనున్నారు గులాబీ బాస్ కేసీఆర్..

ఇప్పటికే సభకు సంబంధిం చిన ఏర్పాట్లన్నీ శర వేగంగా కొనసాగుతున్నాయి..

నిజంనిప్పులాంటిది

Mar 12 2024, 09:15

తెలంగాణకు మరోసారి మోడీ..5 రోజుల షెడ్యూల్ ఖరారు

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో అత్యధిక స్థానాల్లో గెలుపే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ ప్రచారం ముమ్మరం చేసింది. ఇప్పటికే బీజేపీ అగ్రనేతలు రాష్ట్రంలో పర్యటించిన విషయం తెలిసిందే.

తాజాగా, ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి తెలంగాణ రాష్ట్రంలో పర్యటించను న్నారు. మార్చి 16,17,18 వ తేదీల్లో తెలంగాణకు ఆయన రానున్నారు.

మూడు రోజుల పర్యటనలో భాగంగా ఆయన జగిత్యా ల, నాగర్ కర్నూల్, మల్కా జ్‌గిరిలో బహిరంగ సభల్లో పాల్గొనే అవకాశముందని బీజేపీ రాష్ట్ర నాయకత్వం వెల్లడించింది..

నిజంనిప్పులాంటిది

Mar 12 2024, 09:13

Amit Shah: నేడు బీజేపీ విజయ సంకల్ప సమ్మేళనం.. హాజరు కానున్న అమిత్ షా

Amit Shah: బీజేపీ నేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇవాళ రాష్ట్ర పర్యటన షెడ్యూల్ ఖరారైంది. పర్యటనలో భాగంగా ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం 1:20 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు..

మధ్యాహ్నం 1:45 నుంచి 2:45 గంటల వరకు ఇంపీరియల్ గార్డెన్‌లో బీజేపీ సోషల్ మీడియా వారియర్స్ సమావేశంలో అమిత్ షా పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 3:15 నుంచి 4:25 గంటల వరకు ఎల్బీ స్టేడియంలో నిర్వహించే విజయోత్సవ ర్యాలీలో పాల్గొంటారు. బీజేపీ పోలింగ్‌ బూత్‌ కమిటీల అధ్యక్షులు, మండల, జిల్లా కమిటీల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 32 వేల పోలింగ్‌ బూత్‌లు ఉన్నందున ఈ బూత్‌ కమిటీల అధ్యక్షులు, ఇన్‌ఛార్జ్‌లు, ఇతర నాయకులు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి.

అనంతరం రాష్ట్ర నేతలతో షా భేటీ కానున్నారు. సదస్సు అనంతరం ఐటీసీ కాకతీయ హోటల్‌లో సాయంత్రం 4:45 నుంచి 5:45 గంటల వరకు పార్టీ నేతలతో అమిత్ షా సమావేశం నిర్వహించి ఎన్నికల ప్రచారం, నేతల మధ్య సమన్వయం మెరుగ్గా ఉండేలా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వనున్నారు. సాయంత్రం 6:10 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో తిరుగు ప్రయాణం అవుతారు..

నిజంనిప్పులాంటిది

Mar 12 2024, 07:30

నేడు కరీంనగర్లో ‘కథనభేరి’.. హాజరుకానున్న కేసీఆర్

కరీంనగర్ జిల్లా కేంద్రంలో నేడు మంగ‌ళ‌వారం బీఆర్ఎస్ ‘కథనభేరి’ సభ నిర్వహించబోతుంది.

ఈ సభకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరు కానున్నారు. ఈ సందర్భం గా మాజీ మంత్రి గంగుల కమలాకర్ సభ వివరాలను వెల్ల‌డించారు.

ఈరోజు సాయంత్రం 5:30 గంటలకి కరీంనగర్ లో కథనభేరి సభ నిర్వహిస్తు న్నట్లు పేర్కొన్నారు. ముఖ్య కార్యక్రమాలన్నీ కరీంనగర్ నుండే కేసీఆర్ ప్రారంభి స్తారు..

అదే సెంటిమెంట్ తో పార్లమెంట్ ఎన్నికల కథనభేరి కూడా కరీంనగర్ నుండే ప్రారంభం అవుతోం దని గంగుల కమలాకర్ తెలిపారు.

నిజంనిప్పులాంటిది

Mar 12 2024, 07:29

అదిలాబాద్ జిల్లాలో డీఎస్సీ,ఎస్జీటీ, అభ్యర్థులకు ఉచిత శిక్షణ శిబిరం

రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ప్రకటించనున్న డీఎస్సీని దృష్టిలో ఉంచుకొని డీఎస్సీ, ఎస్జీటీ కోసం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నిరుద్యోగ అభ్యర్థులకు ఉచిత శిక్షణను ఇవ్వనున్నట్లు జిల్లా బీసీ అభివృద్ధి అధికారి రాజలింగు, బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.

బీసీ, ఎస్సీ ,ఎస్టీ, ఈబీసీ అభ్యర్థులు ఈ ఉచిత శిక్షణకు అప్లై చేసుకోవాలని కోరారు. అర్హులైన అభ్య ర్థులు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ద్వారా ఈనెల 14 నుంచి 22 వరకు దరఖాస్తు చేసుకో వచ్చన్నారు.

ఈనెల 26 నుంచి శిక్షణ ప్రారంభించనున్నట్లు పేర్కొ న్నారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.5.00 లక్షల లోపు ఉండాలని తెలిపారు.

రిజర్వేషన్ ప్రకారం ఎస్‌జీ టీకి సంబంధించి ఇంటర్మీడి యట్, డైట్, టెట్‌లో సాధిం చిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తామన్నారు.

ఈ ఉచిత శిక్షణ 75 రోజులు ఉంటుందని, నిపుణులైన అధ్యాపకుల చేత శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. మరిన్ని వివరాలకు 087322212809949684959 నంబర్లు సంప్రదించాలని కోరారు.

నిజంనిప్పులాంటిది

Mar 12 2024, 07:27

ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్

మార్చి 12 పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైన సందర్భంగా ముస్లీం సోదరులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ మాసం ఆదర్శ వంతమైన జీవనానికి ప్రేరణనిస్తుందని సీఎం తెలిపారు.

రంజాన్ మాస వేడుకలను సుఖ సంతోషా లతో జరుపుకోవాలని ఆయన తెలిపారు. రంజాన్ మాసంలో ముస్లిం లు కఠోర ఉపవాస దీక్షలు, ప్రార్థనలు, క్రమశిక్షణ పాటిస్తారని పేర్కొన్నారు.

రంజాన్ మాసం ఆదర్శ వంతమైన జీవనానికి ప్రేరణ ఇస్తోందన్నారు. ముస్లిం సోదరులు రంజాన్ మాసాన్ని ఆనందంతో.. సుఖసంతోషాలతో నిర్వహించుకోవాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.

నిజంనిప్పులాంటిది

Mar 11 2024, 16:19

17న పల్నాడులో మోడీ టూర్..!

చారిత్రక, రాజకీయ చరిత్ర కలిగిన పల్నాడు జిల్లా కు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 17 న పల్నాడు జిల్లా కు రానున్నారు.

ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత పల్నాడు జిల్లా చిలకలూరిపేట వద్ద జరిగే తొలి భారీ బహిరంగ సభ లో ఆయన ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు.

ఆయనతో పాటు టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు,జనసేనాని పవన్ కళ్యాణ్ ఇతర నేతలు పాల్గొననున్నారు.

2014 ఎన్నికల సమయంలో కూడా ఈ ముగ్గురు నేతలు కలిసి రాష్ట్రంలో ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్నారు.

ఆ ఎన్నికల్లో టీడీపీ,బీజేపీ లు విజయం సాధించి ప్రభుత్వాలు ఏర్పాటు చేశాయి.

అదే రాజకీయ చరిత్ర కలిగిన పల్నాడు జిల్లా కు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 17 న పల్నాడు జిల్లా కు రానున్నారు.

ఈ సారి కూడా పై ముగ్గురు నేతలు రాష్ట్రంలో ప్రచారం చేసేందుకు సుడిగాలి పర్యటనలు జరిపేందుకు నిర్ణయించారు.

అందులో భాగంగానే బీజేపీ తో పొత్తు కుదిరిన వెంటనే బాబు,పవన్ లు ఏపీ నుంచే ప్రచారాన్ని ప్రారంభించాలని ప్రధాని నరేంద్ర మోడీ అంగీకరించారు.

రాజకీయ ఉద్దండులు ప్రాతినిధ్యం వహించిన పల్నాడుకు వస్తున్న ప్రధాన మంత్రుల్లో నరేంద్ర మోడీ 4వ వారు.

దేశ తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ 1955 లో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ శంఖు స్థాపన కోసం వచ్చారు.

1980 లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ మాచర్ల కేసీపీ గ్రౌండ్ లో జరిగిన సభకు హాజరయ్యారు.

1989 లో నాటి ప్రధాని రాజీవ్ గాంధీ పిడుగురాళ్ల లో జరిగిన ఎన్నికల ప్రచార సభ లో పాల్గొన్నారు.

ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 17 న రానున్నారు.

చిలకలూరిపేట సమీపంలోని బొప్పుడి వద్ద జాతీయ రహదారి పక్కనే ఉన్న 150 ఎకరాల విస్తీర్ణంలో సభ నిర్వహించాలని టీడీపీ,జనసేన నేతలు ఎంపిక చేశారు.

మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు,ఇతర నేతలు ఈ ప్రాంతాన్ని పర్యటించి పై ప్రదేశాన్ని ఎంపిక చేశారు.

సభకు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ఆదివారం నాడు మేదర మెట్ల లో సీఎం వైఎస్ జగన్ పాల్గొంటున్న సిద్ధం సభకు మించి మోడీ,బాబు,పవన్ పాల్గొనే సభ నిర్వహించాలని టీడీపీ, జనసేన నేతలు భావిస్తున్నారు.

అందుకు తగ్గట్టుగానే జిల్లా నేతలందరూ ఈ సభ సక్సెస్ పై దృష్టి పెట్టారు.